
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో గుండెపోటుతో ముంబైకి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ బుధవారం చనిపోయాడు. ముంబై లోని కాలాచౌకి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మహేష్ రామారావ్ సలుంకే (49), స్టేషన్ ఎస్సై గణేశ్, మరో మహిళ కానిస్టేబుల్ అక్కడి కేసు దర్యాప్తులో భాగంగా కాన్పూర్ వెళ్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం గేట్ నెంబర్ 4 వేచి చూస్తుండగ.. మహేశ్కు ఫిట్స్ వచ్చాయి. దీంతో అతను అక్కడే పడిపోవడంతో వెంటనే సిబ్బంది అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడని తెలిపారు. కలచౌకి ఎస్సై గణేష్ ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. .